Header Banner

బ్యాంకులకు గుడ్ బై! ఏటీఎం ద్వారా క్షణాల్లో గోల్డ్ లోన్! ఎలా అనుకుంటున్నారా!

  Wed Apr 23, 2025 20:04        Business

ఇకపై బంగారంపై రుణం పొందడం మరింత సులభం కానుంది. గంటలు, రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా, బ్యాంకు సిబ్బందితో పని లేకుండా, క్షణాల్లో మీ పని పూర్తి చేసుకోచ్చు. ఈ వినూత్న ఆలోచనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ) శ్రీకారం చుట్టింది.

 

దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ) ఆధారిత గోల్డ్ లోన్ ఏటీఎంను అందుబాటులోకి తెచ్చింది. వరంగల్‌లోని కొత్తవాడలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను ఆధునీకరించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎంవీ రావు ఈ గోల్డ్‌లోన్ ATMను ప్రారంభించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి ప్రయోగాత్మక ప్రయత్నం కావడం విశేషం.



ఇది కూడా చదవండి: బిగ్ అలర్ట్.. మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.! వ్యాపారులు అందరూ అప్రమత్తంగా...

 

కొత్త టెక్నాలజీతో సులభంగా రుణాలు:

"ప్రజలకు వేగంగా, సులభంగా బంగారంపై రుణాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ వినూత్న ప్రయత్నం చేస్తున్న మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎంవీ రావు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా వరంగల్‌లో ఏఐ సాంకేతికతతో కూడిన గోల్డ్ లోన్ ఏటీఎంను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.

 

ఏటీఎం ఎలా పనిచేస్తుందంటే..

ఈ ఏటీఎం ద్వారా రుణం పొందడం చాలా సులభం. ముందుగా, ఖాతాదారులు తమ ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ వివరాలను నమోదు చేయాలి. తర్వాత, వారు తమ బంగారు ఆభరణాలను ఏటీఎం లోని బాక్సులో ఉంచాలి. ఏఐ సాంకేతికత సహాయంతో యంత్రం ఆభరణాల నాణ్యత, బరువును క్షణాల్లో అంచనా వేస్తుంది. ఆ రోజు మార్కెట్ ధర ప్రకారం రుణ మొత్తాన్ని లెక్కిస్తుంది. వెంటనే, రుణ మొత్తంలో 10 శాతం నగదు ఏటీఎం ద్వారా లభిస్తుంది. మిగిలిన మొత్తం ఖాతాదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియ కేవలం 10-12 నిమిషాల్లోనే పూర్తవుతుంది.

 

సమయం ఆదా, సురక్షితం:

సాధారణంగా బ్యాంకుల్లో బంగారంపై రుణం పొందడానికి చాలా సమయం పడుతుంది. కానీ, ఈ ఏటీఎం వల్ల బ్యాంకు సిబ్బందికి, ఖాతాదారులకు ఎంతో సమయం ఆదా అవుతుంది. అంతేకాదు, ఈ ప్రక్రియ అంతా అత్యంత సురక్షితంగా జరుగుతుంది. ఈ వినూత్న ప్రయోగం విజయవంతమైతే, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ సేవలను వినియోగించుకోవాలనుకునే వారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా కలిగి ఉండాలి.


సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినూత్న ఆలోచనతో ప్రవేశపెట్టిన ఈ గోల్డ్‌లోన్ ఏటీఎం ఎంతో మందికి ప్రయోజనం చేకూరుస్తుంది. సమయం ఆదా చేయడంతో పాటు, సులభంగా, వేగంగా రుణాలు పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని ఆశిద్దాం..


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు లక్షల మందికి..

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #InstantGoldLoan #GoldLoanATM #NoMoreBanks #FastLoanApproval #ATMLoanService #DigitalGoldLoan